అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Hanuman Shobha Yatra | జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే హనుమాన్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశ్వహిందూ పరిషత్ హిందూ సమ్మేళనం, బజరంగ్దళ్ హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతియేటా యాత్రను ఘనంగా నిర్వహించడం సాంప్రదాయంగా మారింది.
Hanuman Shobha Yatra | ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్య..
హనుమాన్ శోభాయాత్రను గత పదేళ్ల నుంచి చూస్తూ.. ప్రతి ఏడాదికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు శోభాయాత్రలో పాల్గొనడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. భక్తులు ప్రతి ఏటా జిల్లా కేంద్రానికి తరలివచ్చి హనుమాన్ శోభాయాత్రలో (Hanuman Shobha Yatra) ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
Hanuman Shobha Yatra| హైదరాబాద్ తర్వాత ఇందూరులోనే..
ప్రతి యేటా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ (Hyderabad) నగరంలో శోభాయాత్రకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇందూరులోనే అంత గొప్పగా యాత్ర జరుగుతుందని భక్తులు పేర్కొంటున్నారు. శోభాయాత్రలో వేలల్లో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. హైదరాబాద్ తర్వాత నిర్వహించే నిజామాబాద్ (Nizamabad) నగరంలో జరిగే ర్యాలీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Hanuman Shobha Yatra | శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇదే..
గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వహిస్తారు. యాత్ర కంఠేశ్వర్ ఆలయం (Kanteshwar Temple) నుంచి ప్రారంభమయ్యే యాత్ర.. జడ్పీ చౌరస్తా, హ మాల్వాడి, పాత ప్రభాస్ టాకీస్, రైల్వే ఫ్లైఓవర్ మీదుగా, గోదాం రోడ్, దేవి రోడ్ మీదుగా వెళ్తుంది. అక్కడి నుంచి మమతా సర్కిల్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఆజాంరోడ్, పెద్దబజార్, లక్ష్మి మెడికల్ మీదుగా చివరిగా ఆర్ఆర్ చౌరస్తాకు చేరుతుంది. శోభాయాత్రలో దేవత విగ్రహాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. శోభాయాత్ర వెళ్లే మార్గాల్లో దుకాణాదారులు, వ్యాపారస్తులు తమ వాహనాలను రోడ్ల పక్కన నిలిపి ఉంచరాదని పోలీసులు తెలిపారు.
Hanuman Shobha Yatra | ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల దారి మళ్లింపు
హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వచ్చి పోయే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు బస్టాండ్, జడ్పీ క్రాస్ రోడ్, సుభాష్ నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ రోడ్డు జంక్షన్ నుంచి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, నుంచి కంఠేశ్వర్ బైపాస్ జంక్షన్ చేరుకొని హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వైపు వెళ్లాలి. తిరిగి ఇదే మార్గం గుండా నిజామాబాద్ బస్టాండ్ చేరుకోవాల్సి ఉంటుంది. బోధన్ నుంచి వచ్చిపోయే వాహనాలు అర్సపల్లి రైల్వేగేట్ నుంచి కొత్త కలెక్టరేట్, నుంచి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ రోడ్డు జంక్షన్ నుంచి సుభాష్ నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్ జెడ్పీ జంక్షన్, ఎన్టీఆర్ చౌరాస్తా, అర్టీసీ బస్టాండ్ చేరుకోవాలి. బాన్సువాడ నుంచి వచ్చి పోయే వాహనాలు వర్ని చౌరస్తా నుంచి పులాంగ్ సర్కిల్, కోర్డు సర్కిల్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వేస్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ చేరుకోవాలి.
సీసీ, డ్రోన్ కెమెరాలతో పట్టిష్టమైన నిఘా..
హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా జరిగేందుకు 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శోభాయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు దారి పొడవునా పోలీసు సిబ్బంది యాత్రను పర్యవేక్షిస్తూ ఉంటారన్నారు. పాత నేరస్తులపై నిఘా పటిష్టపర్చామని తెలియజేశారు. నిజామాబాద్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ , ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బంది, టీఎస్ఎస్పీ బెటాలియన్ పోలీసులు, 20 స్పెషల్ పార్టీ పోలీసులతో యాత్రకు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఇది కూడా చదవండి..: Ayyappa Blessings | అయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా: ఎమ్మెల్యే ధన్పాల్
