అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: HIV Awareness | సమాజంలో ప్రతిఒక్కరికి హెచ్ఐవీపై అవగాహన (Health Awareness Programs) ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ (Additional Collector Kiran Kumar) అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో భాగంగా జీజీహెచ్లో (Nizamabad GGH) ఎయిడ్స్ అవేర్నెస్ వాకథాన్ను డీఎంహెచ్వో రాజశ్రీతో కలిసి ఆయన ప్రారంభించారు.
HIV Awareness | అవగాహన ఉంటేనే ఆరోగ్యం భద్రం..
ఎయిడ్స్పై (AIDS) అవగాహన ఉంటేనే అది రాకుండా (AIDS Prevention) జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ అన్నారు. హెచ్ఐవీ గురించి ప్రతిఒక్కరూ నిర్మొహమాటంగా మాట్లాడాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ జీజీహెచ్లో సంపూర్ణ సురక్ష కేంద్రం వద్ద రోగ నిర్ధారణ పరీక్షల క్లినిక్ను, మైత్రి క్లినిక్ వద్ద ట్రాన్స్జెండర్స్ కోసం రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రంను ప్రారంభించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ జలగం తిరుపతి రావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి దేవి నాగేశ్వరి, డిప్యూటీ డీఎంహెచ్వో అశ్విని, ఎన్వీహెచ్సీపీ వైద్యుడు వెంకటేష్, డీఈ శ్రావ్య, టీబీ మెడికల్ ఆఫీసర్ అవంతి, ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్స్, డీహెచ్ఈ ఘనపురం వెంకటేశ్వర్లు, డీపీఎం సుధాకర్, స్నేహ సొసైటీ సిద్దయ్య, పీఎంవో రూప, మోయిజ్, నవీన్, రవి గౌడ్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా వైద్య శాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
