అక్షరటుడే, వెబ్డెస్క్: Hormuz Strait India |భారత్కు ఇరాన్ ఊరటనిచ్చింది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా భారత్కు వచ్చే నౌకల రవాణాకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. భారత్ జెండాలతో వచ్చే నౌకలను అనుమతించనున్నట్లు పేర్కొంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసి వేసిన విషయం తెలిసిందే. ఆ మార్గంలో నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటుంది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా నిలిచి అనేక దేశాల్లో సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs of India) రంగంలోకి దిగింది. ఇరాన్తో చర్చలు జరిపింది. చర్చలు సఫలం కావడంతో భారత జెండాలతో ఉన్న నౌకలను అనుమతించాలని ఆ దేశం నిర్ణయించింది. ఇప్పటికే భారత్కు చెందిన రెండు చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటి వచ్చాయి. అందులో ఒకటి బుధవారం ముంబైని చేరుకుంది.
Hormuz Strait India | ఆ దేశాలపై ఆంక్షలు
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar), ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత నౌకల రవాణాలకు అనమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. రెండు భారతీయ చమురు ట్యాంకర్లు పుష్కర్, పరిమల్ హార్ముజ్ జలసంధి మీదుగా సురక్షితంగా వెళ్లాయి. అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ నుంచి చమురు ట్యాంకర్ల ప్రయాణానికి ఆంక్షలు అమలులో ఉన్నాయి.

Hormuz Strait India | కీలక మార్గం
ఇరాన్ తీరానికి ఆనుకుని ఉన్న హార్ముజ్ జలసంధి ద్వారా దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అవుతుంది. ప్రపంచంలోని చమురు వినియోగంలో ఇది ఐదో వంతు. దీంతో ఈ మార్గం ఎంతో కీలకం. దీనిని ఇరాన్ మూసివేయడంతో చాలా దేశాల్లో ఆయిల్, గ్యాస్ కొరత నెలకొంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా పలు దేశాలు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచాయి.
ఇది కూడా చదవండి..: Iran War Ceasefire | యుద్ధం ఆపేస్తాం.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన

