అక్షరటుడే, వెబ్డెస్క్ : Hormuz Strait Tension | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసి వేయడంతో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో అమెరికా భారీగా బలగాలను జలసంధి సమీపంలోకి పంపడం గమనార్హం.
హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని ట్రంప్ (Donald Trump) ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. లేదంటే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ట్రంప్కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. ఈ క్రమంలో జలసంధి వద్దకు భారీగా సెయిలర్లు, మెరైన్లను అమెరికా పంపించింది.
Hormuz Strait Tension | 5 వేల బలగాలు
హర్మూజ్ భద్రతతో పాటు.. ఇరాన్ చమురు (Iranian Oil) మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఇందుకోసమే దాదాపు 5 వేల మంది బలగాలను పంపించినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై ఇరాన్ సైతం స్పందించింది. భూ ఆక్రమణకు ప్రయత్నిస్తే పర్షియన్ గల్ఫ్లో మరిన్ని సీ మైన్స్ను పెడతామని వార్నింగ్ ఇచ్చింది.హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసి వేయలేదని ఇరాన్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్కు (Israel) సంబంధించిన నౌకలు మినహా మిగిలిన నౌకలు ప్రస్తుతం భద్రతా, రక్షణ నిబంధనలకు లోబడి ప్రయాణించడానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే తాజాగా అమెరికా బలగాలను పంపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇది కూడా చదవండి..: Pakistan Fuel Crisis | పాకిస్థాన్లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు

