అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Land Encroachment | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భూముల రేట్లు ఆకాశాన్ని తాకడంతో కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. చివరకు శ్మశాన వాటికలను వదలడం లేదు. చెరువులు, నాలాలతో పాటు శ్మశానవాటిక స్థలాలను కబ్జా చేస్తున్నారు.
హైడ్రా (Hydraa) కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రజ అవసరాలకు కేటాయించిన స్థలాల ఆక్రమణలపై మొత్తం 32 ఫిర్యాదులు వచ్చాయి. చెరువులను బాగు చేయాలని, ఆక్రమణలు తొలగించాలని పలువురు వినతి పత్రం అందించారు. యూసుఫ్గూడ, మధురానగర్ ప్రాంతాల్లో ఉన్న కృష్ణాకాంత్ పార్కులో చెరువును అభివృద్ధి చేయాలని వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైడ్రాను కోరారు. గతంలో చెరువును చాలా వరకూ పూడ్చేసి పార్కును చేశారని.. ఇప్పుడున్న చెరువును కొంతమేర విస్తరిస్తే వరదను కట్టడి చేయవచ్చునని పేర్కొన్నారు. నిర్వహణ లేక చెరువు దుర్గందం వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Hyderabad Land Encroachment | పార్క్ ఆక్రమణకు యత్నం
శేరిలింగంపల్లి (Serilingampally) పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్-1 కాలనీలో పార్క్ నం.4 భూమిని కొందరు ఆక్రమించడానికి యత్నిస్తున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులు పార్క్ కంపౌండ్ వాల్లో కొంత భాగాన్ని కూల్చివేశారన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలోని టీఎన్జీవోస్ కాలనీలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్లాట్ నంబర్ 311 ప్రాంతంలో సుమారు 300 గజాల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని కొందరు ఆక్రమించారని ఆరోపించారు.
Hyderabad Land Encroachment | శంషాబాద్లో…
శంషాబాద్ (Shamshabad)లోని ఎంబీ మిషన్ కంపౌండ్లో ఉన్న సమాధుల స్థలం కబ్జాకు గురవుతున్నట్లు ఎంబీ చర్చి, ఎంబీ సమాధుల నిర్వహణ కమిటీ ప్రతినిధి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 619లో ఉన్న చర్చి సమాధులకు సబంధించిన ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో నమోదై ఉందన్నారు. కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 618గా చూపిస్తూ రికార్డులను మార్పులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ పొందినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అక్రమంగా కంచెలు వేయడం, నిర్మాణ పనులు చేపడుతున్నారని ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి : Bamrukn Ud Daula Lake | ప్రారంభానికి బమృకున్ – ఉద్ – దౌలా చెరువు సిద్ధం

