అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Road Accident | హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బైక్ను అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులతో పాటు మరో వ్యక్తి చనిపోయాడు.
నగరంలోని సాగర్ రోడ్డు హస్తినాపురం (Hastinapuram) వద్ద బుధవారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని, నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిని ఢీకొట్టాడు. బైక్ను వందమీటర్లకు వరకు కారు ఈడ్చుకు వెళ్లింది. అనంతరం బోల్తా పడింది. ఈ ఘటనలో మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీ (Mahaveer Engineering College) విద్యార్థులు శివ, సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుపై వెళ్తున్న మరో యువకుడు కూడా చనిపోయాడు.
Hyderabad Road Accident | విద్యార్థుల ఆందోళన
తమ మిత్రులు మృతి చెందడంతో మహవీర్ కాలేజీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల ఆందోళనకు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ను తమకు అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని సముదాయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Pilot Assault | పైలెట్ ట్రైనింగ్ సెంటర్లో దారుణం.. యువతిపై అత్యాచారం
