అక్షరటుడే, వెబ్డెస్క్:Hyderabad Rotten Chicken | హైదరాబాద్ నగరంలో టాస్క్ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officials) మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ చికెన్ షాపులో భారీగా కుళ్లిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు.నగరంలోని పార్సీగుట్ట ఏ1 ప్రెష్ చికెస్ షాపుపై అధికారులు దాడులు చేపట్టారు.
కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచిన చికెన్ను గుర్తించారు. దానిని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు గమనించారు. సుమారు 800 కిలోల చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ షాపులో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ, వైన్షాపులు, బార్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారు. ఈ దుకాణం లైసెన్స్ గడువు జనవరిలోనే ముగిసింది. అయినా కూడా అలాగే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, చికెన్ సెంటర్ యజమాని షకీల్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Rotten Chicken | మద్యం స్వాధీనం
స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (Special Task Force Police) దాడులు చేపట్టి భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గోవా నుంచి అక్రమంగా తెలంగాణలోకి తీసుకొచ్చిన 239 మద్యం బాటిళ్లను శంషాబాద్ సమీపంలో సీజ్ చేశారు. వీటి విలువ రూ.4.26 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ.52 వేల విలువైన 26 సీసాలు స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం

