అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Samosa Raid | హైదరాబాద్లోని జియాగుడ (Jiyaguda)ప్రాంతంలో గల సమోసాల తయారీ కేంద్రంపై ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), కుల్సుంపుర పోలీసులు దాడి చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
కేంద్రంలో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి సమోసాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతనికి FSSAI లైసెన్స్, వ్యాపార అనుమతి లేవని పేర్కొన్నారు. సమోసాల తయారీలో కనీస నిబంధనలు పాటించడం లేదన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెడుతున్నారని గుర్తించారు.
Hyderabad Samosa Raid | రూ. 5లక్షల విలువైన సామగ్రి స్వాధీనం
దాడిలో సుమారు ఐదు లక్షల రూపాయల విలువ చేసే అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు, ముడి పదార్థాలు, ఇతర వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకుడుని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులు (Task Force Officers), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, స్థానిక పోలీసు బృందాల పర్యవేక్షణలో దాడులు నిర్వహించారు.
Hyderabad Samosa Raid | వరుస దాడులు
హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార (Adulterated Food) పదార్థాలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల పలు చోట్లు భారీగా కల్తీ అల్లంవెల్లులి పేస్ట్, కల్తీ పన్నీరు, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసింది. ఇందుకోసం ప్రభుత్వం ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) టీంను ఏర్పాటు చేసింది. ఈ టీం నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న వారి పనిపడుతున్నారు.
An illegal food manufacturing unit engaged in the large-scale preparation of samosas under grossly unhygienic conditions was successfully busted by the Hyderabad Food Adulteration Surveillance Team (H-FAST) of the Task Force, in coordination with Kulsumpura Police, on 20.03.2026… pic.twitter.com/NnOHOyq56d
— Hyderabad City Police (@hydcitypolice) March 21, 2026
ఇది కూడా చదవండి..: Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య

