అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి అనగానే హైదరాబాద్ (Hyderabad) నగరంలో శోభాయాత్ర గుర్తుకు వస్తుంది. లక్షలాది మంది భక్తులు రాముడి శోభాయాత్రకు తరలి వస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajajsingh) ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా సాగుతుంది. సీతారాంబాగ్ ఆలయం నుంచి ఒక్క యాత్ర, ఆకాష్పురి హనుమాన్ ఆలయం నుంచి మరో యాత్ర ప్రారంభం అవుతాయి. ఈ రెండు యాత్రలు గాంధీ విగ్రహం వద్ద కలుస్తాయి. అనంతరం అక్కడి నుంచి యాత్ర సుల్తాన్బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనుంది.
Hyderabad traffic restrictions | ఈ మార్గాల్లో వెళ్లాలి
శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని పోలీసులు తెలిపారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు ఉంటాయన్నారు. వాహనదారులు సీతారాంబాగ్ నుంచి భోయిగూడ కమాన్, మంగళ్హాట్, పురానాపూల్, జుమేరాత్ బజార్, బేగం బజార్, MJ మార్కెట్, కోఠి మీదుగా సుల్తాన్ బజార్ చేరుకోవాలి.
Hyderabad traffic restrictions | ట్రాఫిక్ మళ్లింపు కేంద్రాలు
ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ మల్లేపల్లి క్రాస్ రోడ్స్ వద్ద మళ్లిస్తారు. పురానాపూల్ నుంచే వాహనాలను కార్వాన్ / 100 ఫీట్ల రోడ్డు వైపు వెళ్లాలి. MJ బ్రిడ్జ్ / అబిడ్స్ నుంచి వచ్చే వాహనాలు MJ మార్కెట్, GPO వద్ద ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించనున్నారు. చాదర్ఘాట్, నారాయణగూడ నుంచి వచ్చే వాహనాలు రంగమహల్, కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద మళ్లిస్తారు. శోభాయాత్ర ఒక్కో కూడలిని దాటుకుంటూ వెళ్లే కొద్దీ ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు దశలవారీగా ఎత్తి వేస్తారు.

దీనిని కూడా చదవండి : Sri Rama Navami | శ్రీరామ నవమి నైవేద్యాల విశిష్టత.. ఈ ఒక్కటి సమర్పిస్తే సకల శుభాలు!

