అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలో రోజు రోజుకు విస్తరిస్తోంది. శివారు ప్రాంతాల్లో తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నీటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నియోపోలిస్ ప్రాంతంలో జల మండలికి 3.95 ఎకరాల భూమిని కేటాయించింది.
Hyderabad Water Supply | ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో..
ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) పరిసర ప్రాంతాల్లో వేగవంతమైన జనాభా వృద్ధి జరుగుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఫేజ్-2, ఫేజ్–3, మూసీ నది పునరుజ్జీవానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను గోదావరి జలాలతో నింపడానికి అదనంగా 300 ఎంజీడీ నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం జలమండలికి భూమి కేటాయించింది.
Hyderabad Water Supply | వేగంగా అభివృద్ధి
నియో పోలీస్, పరిసర ప్రాంతాల్లో పట్టణీకరణ వేగంగా జరగుతోంది. దీంతో నీటి అవసరం సైతం పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆదేశాలతో కొకాపేట్ నియోపోలిస్ లేఅవుట్లో సంప్, పంప్ హౌస్, సెక్షన్ ఆఫీస్, GLSR & STP నిర్మాణం పనులు చేపట్టారు. కొకాపేట్ ప్రాంతంలో జలమండలికి ఇప్పటికే ఉన్న భూమిని దీని కోసం వినియోగించారు. అయితే అదనపు భూమి అవసరం పడింది. దీంతో ఖానాపూర్ జలమండలి (Khanapur Water Board)కి ఆవరణను ఆనుకుని ఉన్న 3.95 ఎకరాలు కేటాయించాలని అధికారులు కోరారు. దీంతో ప్రభుత్వం ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకుంది.

Hyderabad Water Supply | పంపింగ్ అవసరం లేకుండా..
ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన భూమి +592.00 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో మొత్తం సర్వీస్ ప్రాంతానికి గ్రావిటీ విధానంలో(పంపింగ్ అవసరం లేకుండా) తాగునీటి సరఫరా చేయడానికి అనుకూలంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ రిజర్వాయర్ ద్వారా నియో పోలీస్, కోకాపేట పరిసర ప్రాంతాలకే కాకుండా, నగరంలోని బోజగుట్ట రిజర్వాయర్కు గ్రావిటీతో నీటిని సరఫరా చేయనున్నారు. ఓల్డ్ సిటీ, షేక్ పేట, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతవాసులకు గ్రావిటీతో మంచినీటి సరఫరా చేసే వెసులుబాటు ఉంటుంది. దీంతో జలమండలికి విద్యుత్ ఛార్జీలు మిగులుతాయి.
ఇది కూడా చదవండి..: KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన : కేటీఆర్

