అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa Demolitions Hyderabad | హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపై హైడ్రా కొరఢా ఝుళిపిస్తోంది. తాజాగా రాజేంద్రనగర్ (Rajendranagar)లో అక్రమంగా నిర్మించిన పలు భవనాలను అధికారులు కూల్చివేశారు.
రాజేంద్రనగర్ పరిధిలోని మైలర్దేవ్పల్లి శాస్త్రినగర్ (Shastri Nagar)లో ఆటస్థలాన్ని ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు హైడ్రా అధికారులు (HYDRAA Officers) బుధవారం ఉదయమే రంగంలోకి దిగారు. జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఐదు భవనాలు కూల్చివేశారు. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు.
Hydraa Demolitions Hyderabad | భారీ ఆపరేషన్
మైలార్దేవ్పల్లి గ్రా శాస్త్రిపురం కాలనీలో బుధవారం హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇక్కడ హుడా అనుమతితో 188 ఎకరాల లే అవుట్ వేశారు. ఇందులో ఆటస్థలం కోసం 6500 గజాలు కేటాయించారు. దానిని కొందరు ఆక్రమించారు. గత 3 ఏళ్లుగా ఆ ప్లాట్లను ‘నోటరీ’ పత్రాల ద్వారా విక్రయిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఫిర్యాదు గతంలో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా నిర్మాణాన్ని కొనసాగించడంతో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు.

Hydraa Demolitions Hyderabad | 5 భవనాలు నేలమట్టం
Hydraa అధికారులు, GHMC, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో స్థలాన్ని తనిఖీ చేశారు. లేఅవుట్ ప్రకారం ఆ స్థలం క్రీడా మైదానం కోసమే కేటాయించినట్లు నిర్ధారించారు. అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం తొలగింపు ప్రక్రియ చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఐదు ‘G+3’ (మూడు అంతస్తుల) భవనాలను తొలగించారు. అలాగే మరో రెండు గది నిర్మాణాలను సైతం నేలమట్టం చేశారు. అప్పటికే నివాసాలు ఏర్పరచుకున్న మరో రెండు భవనాలను మాత్రం తొలగించలేదు.
ఇది కూడా చదవండి..: Gas Shortage Protest | గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల ఆందోళన
