అక్షరటుడే, వెబ్డెస్క్: I-PAC ED Raids | దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగున్న వేళ కీలక పరిణామా చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సంస్థ ‘ఐప్యాక్’ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ (Money Laundering) ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.
I-PAC ED Raids | దేశవ్యాప్తంగా తనిఖీలు..
దేశవ్యాప్తంగా గల ఐప్యాక్ కార్యాలయాలతో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాల్లోని గల ఆఫీస్లు ఈడీ అధికారులు (ED Officers) ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
I-PAC ED Raids | మనీలాండరింగ్ కోణంలో విచారణ..
ఐప్యాక్ ఆర్థిక లావాదేవీలపై కొంతకాలంగా నిఘా పెట్టిన ఈడీ అధికారులు, మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. రాజకీయ వ్యూహాల కోసం వివిధ పార్టీల అందిన నిధుల మళ్లింపుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా.. వివిధ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను అందించే ఐప్యాక్పై ఈడీ దాడులు జరగడం ప్రస్తుతం దేశంలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరతీసింది. కాగా.. పశ్చిమబెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..: Central Government Salary Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంపు!.. ఎప్పటినుంచి అమలులోకి రావొచ్చంటే?
