అక్షరటుడే, వెబ్డెస్క్ : IAS posting | ఐఏఎస్ అధికారి వాణిప్రసాద్ (IAS Vani Prasad)కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
IAS posting | ఏపీ నుంచి..
ఐఏఎస్ అధికారిణి ఏ వాణిప్రసాద్ను గతంతో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించారు. అనంతరం మార్చిలో తిరిగి తెలంగాణకే కేటాయిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (DOPT) ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆమె వెయిటింగ్లో ఉన్నారు. 1995 బ్యాచ్కు చెందిన ఆమెను యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం తాజాగా నియమించింది.
ప్రస్తుతం ఆ బాధ్యతలను చూస్తున్న జయేశ్ రంజన్ను రిలీవ్ చేసింది. 1992 బ్యాచ్కు చెందిన జయేష్ రంజన్ మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, ప్రభుత్వ క్రీడల స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎఫ్ఏసీ పదవిలో కొనసాగుతారు.
దీనిని కూడా చదవండి : Hyderabad Mosquito Menace | హైదరాబాద్లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన
