అక్షరటుడే, వెబ్డెస్క్: Ice Cream Ban Guduru | సాధారణంగా గ్రామాల సరిహద్దుల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, శుభాకాంక్షల బ్యానర్లు కనిపించడం సహజం. అయితే గూడూరు గ్రామం (Guduru Village)లో మాత్రం పూర్తిగా భిన్నమైన హెచ్చరిక బోర్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మా ఊరిలోకి ఐస్క్రీం బండ్లు రాకూడదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తాం అని స్పష్టంగా పేర్కొంటూ గ్రామ ప్రవేశంలో బోర్డు ఏర్పాటు చేశారు.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం పిల్లల ఆరోగ్యం. ఇటీవల గ్రామంలోకి వస్తున్న స్థానిక తయారీ ఐస్క్రీం బండ్ల (Ice Cream Carts) వల్ల చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు గ్రామస్థులు గుర్తించారు.
Ice Cream Ban Guduru | నిషేధానికి కారణాలు:
ఐస్క్రీంలలో ఉపయోగిస్తున్న రసాయనాలు, రంగుల గురించి స్పష్టత లేకపోవడం. అలానే వీటిని తిన్న పిల్లలకు దంత సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు రావడం, లైసెన్స్ లేకుండా తయారు చేసిన ఐస్క్రీంలను తక్కువ ధరలకు అమ్మడం, చిన్నారులు వీటికి అలవాటు పడిపోవడం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి వారం రోజుల క్రితం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గూడూరు గ్రామం ప్రజలు ఇలాంటి సామాజిక నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన మద్యం బెల్ట్ దుకాణాన్ని కూడా గ్రామస్థులే ముందుకు వచ్చి తొలగించారు.
Ice Cream Ban Guduru | కల్తీ ఆహారంపై పెరుగుతున్న అవగాహన
ఇప్పుడు ఐస్క్రీం బండ్లపై నిషేధం విధించడం ద్వారా గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగించాలని వారు భావిస్తున్నారు.ప్రభుత్వ అధికారుల తనిఖీల కోసం వేచి చూడకుండా ప్రజలే స్వయంగా ఫుడ్ సేఫ్టీ (Food Safety)పై చైతన్యంగా వ్యవహరించడం అభినందనీయమని స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇతర గ్రామాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే, చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Tirumala June Quota | శ్రీవారి భక్తులకు అలెర్ట్.. జూన్ దర్శన కోటా షెడ్యూల్ విడుదల

