అక్షరటుడే, వెబ్డెస్క్ : India Advisory | ఇరాన్లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) సూచించింది. ఈ మేరకు బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. దీనికోసం రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని సూచించింది.
కొంతకాలంగా రగులుతున్న పశ్చిమాసియాలో సీజ్ఫైర్ (Cease Fire)తో కాల్పుల మోత ఆగిన విషయం తెలిసిందే. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా అంగీకరించాయి. ఈ క్రమంలో భారత్ అడ్వైజరీ జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ప్రాంతంలో భద్రతపై కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ సలహా జారీ చేసినట్లు తెలుస్తోంది. రెండు వారాల పాటు ఘర్షణలకు విరామం ప్రకటించినప్పటికీ, పరిస్థితి అనిశ్చితంగానే ఉందని అధికారులు చెప్పారు.
India Advisory | నిర్దేశిత మార్గాల్లో..
ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారత పౌరులు రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని దేశం విడిచి వెళ్లాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అధికారులు సిఫార్సు చేసిన నిర్దేశిత ప్రయాణ మార్గాలను అనుసరించాలని తెలిపింది. విదేశాల్లోని భారత పౌరులకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చదవండి..: Mohsina Kidwai Death | కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ కన్నుమూత
