అక్షరటుడే, వెబ్డెస్క్ : India Petrol Shortage | దేశంలో పెట్రోల్ కొరతపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో చమురు (Crude Oil), గ్యాస్ కొరత లేదని తెలిపింది. హార్ముజ్ జలసంధి ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా రవాణా కొనసాగుతున్నట్లు పేర్కొంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో ముడి చమురు, గ్యాస్, ఇతర సరుకు రవాణా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడ్డాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది.
India Petrol Shortage | ఎల్పీజీ ఉత్పత్తి పెంచాం
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) నుంచి కాకుండా వేరే మార్గాల ద్వారా 75 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. LPG ఉత్పత్తి 25 శాతం పెంచామని చెప్పింది. LNG కొరత కూడా తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. త్వరలో భారత్కు రెండు షిప్లు వస్తున్నాయని కేంద్రం తెలిపింది.
India Petrol Shortage | రెండున్నర రోజుల్లో..
వంట గ్యాస్ సిలిండర్ల (Gas cylinders) కొరతపై లేదని, బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హార్ముజ్ జలసంధితో ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించింది. దీంతో దేశంలోని పలు హోటళ్లు మూతపడగా.. హాస్టళ్లకు సైతం గ్యాస్ సరఫరా నిలిచి నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించకుండా రెండు సిలిండర్ల మధ్య బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంచింది.

