అక్షరటుడే, వెబ్డెస్క్ : India T20 Final | టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ (New Zealand) బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ.. ఆ తర్వాత వీర విహారం చేశారు.
భారత ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రతి బాల్ను బౌండరీకి తరలించాలనే కసితో ఆడారు. దీంతో పరుగుల వరద పారింది. వరల్డ్ కప్లో విఫలం అవుతూ వస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తుది పోరులో సత్తా చాటాడు. 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. గత మూడు మ్యాచ్ల నుంచి కీలకంగా మారిన సంజు శాంసన్ మరోసారి సత్తా చాటాడు. ఓపెనర్లు చెలరేగడంతో భారత్ పవర్ ప్లేలో 92 పరుగులు చేసింది.
India T20 Final | ఇషాన్ హాఫ్ సెంచరీ
అభిషేక్ శర్మ ఔట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ సైతం చెలరేగి ఆడాడు. శాంసన్తో పాటు స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు. ఇషాన్ 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి.
India T20 Final | ఒకే ఓవర్లో మూడు వికెట్లు
న్యూజిలాండ్ బౌలర్ నీషమ్ 16వ ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. సెంచరీకి చేరువైన శాంసన్ (89)ను, ఇషాన్ కిషన్ను ఔట్ చేశాడు. అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం అదే ఓవర్లో తొలి బంతికే క్యాచ్ అవుట్ అయ్యాడు. నీషమ్ 16 వ ఓవర్లో మూడు వికెట్లు తీసి ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో స్కోర్ వేగం నెమ్మదించింది. హర్దిక్ పాండ్య 13 బంతుల్లో 18 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. శాంసన్, ఇషాన్ అవుట్ అయ్యాక పరుగులు తగ్గాయి. చివరి ఓవర్లో దూబే 24 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్లు ఉన్నాయి. దీంతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది.
ఇది కూడా చదవండి : T20 World Cup Final | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

