అక్షరటుడే, వెబ్డెస్క్: India vs England Semi | టీ20 వరల్డ్కప్ 2026 సెమీఫైనల్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన పోరులో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. న్యూజిలాండ్తో జరిగే T20 ప్రపంచ కప్ ఫైనల్కు సిద్ధమైంది.
ముంబయిలోని Wankhede Stadium స్టేడియంలో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన సెమి ఫైనల్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసి ఇంగ్లండ్కు భారీ లక్ష్యానికి నిర్దేశించింది.
India vs England Semi | సంజూ అద్భుత ఇన్నింగ్స్
ఇంగ్లండ్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (9 రాణించలేక ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (11 ) పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ (89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇషాన్ కిషన్ (39) విలువైన ఇన్నింగ్స్ ఆడగా, మధ్యవరుసలో శివమ్ దూబే (43) జత కలిశాడు. తిలక్ వర్మ (21) సహకరించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (27) వేగంగా ఆడి జట్టు పరుగులను 250 దాటించాడు.
రషీద్ అరుదైన చెత్త రికార్డు
ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన చెత్త రికార్డు నమోదు చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ సిక్సర్లు సమర్పించుకున్న మొదటి బౌలర్గా నిలిచాడు. భారత బ్యాటర్లు వరుసపెట్టి సిక్సర్లు బాదడంతో రషీద్ తాజా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.

India vs England Semi | భారీ లక్ష్యం
ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ ఖాన్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆడిల్ రషీద్ ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ భారత బ్యాటర్ల దూకుడును నియంత్రించలేకపోయారు.
ఇక 254 పరుగుల భారీ లక్ష్య ఛేదన కోసం తదుపరి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు బ్యాటర్లు గట్టి పోటీ ఇచ్చారు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు.
ఇక డేంజర్ ప్లేయర్గా పేరొందిన ఫిల్ సాల్ట్ 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. హార్దిక్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 13 పరుగులకే ఇంగ్లాండ్ తొలి వికెట్ పోగొట్టుకుంది.
ఇక తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రం రాణించారు. జాకబ్ బెథెల్ 45 బంతుల్లో సెంచరీ చేసి, తీరుగులేని అద్భుతమైన ఆటతీరు కనబర్చాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఓవర్లో జాకబ్ బెథెల్ రనౌట్ అయ్యాడు. దీంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది.
105 పరుగులు చేసి బెథెల్ చివరి ఓవర్లో ఔట్ కావడంతో ఫైనల్కు చేరుకోవాలనే ఇంగ్లాండ్ ఆశలు ముగిసిపోయాయి. జాకబ్ వికెట్ తీసి, హార్దిండ్ పాండ్యా ఇన్నింగ్ను తిరిగి భారత జట్టు చేతిలోకి తెచ్చాడు. దీంతో గెలుపు సాధ్యమైంది.
India vs England Semi | నాలుగో సారి ఫైనల్కు..
ఇక మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో భారత జట్టు తలపడనుంది. తాజా గెలుపుతో టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు భారత జట్టు నాలుగోసారి చేరుకుంది.

