అక్షరటుడే, వెబ్డెస్క్: India vs New Zealand Final | T20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్లో (India vs New Zealand Final) తలపడనున్నాయి. ఉత్కంఠ పోరుకు మరికొద్ది గంటలే ఉంది.
India vs New Zealand Final | ట్రోఫీ కోసం అమీతుమీ
తొలిసారి ట్రోఫీ ఎత్తాలని న్యూజిలాండ్ కలలు కంటుండగా.. భారత్ తన టైటిల్ను కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్లో టాస్ కీలకంగా మారనుంది. టీ20 వరల్డ్ కప్లో 2010 నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు ఫైనల్స్లో టాస్ గెలిచిన జట్టే విజయం సాధించింది. దీంతో టాస్పై క్రికెట్ ఫ్యాన్స్లో చర్చ జరుగుతోంది.
రెండు సార్లు టాస్ గెలిచిన భారత్
ఈ టోర్నమెంట్లో భారత్ రెండు సార్లు మాత్రమే టాస్ గెలిచింది. అయితే టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా ఒక్క మ్యాచ్లోనే ఓడిపోయింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. ఇక న్యూజిలాండ్ కూడా టాస్ రెండు సార్లు గెలిచినప్పటికీ, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్తో రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూసింది.
పిచ్ ఎలా స్పందిస్తుందో..
2023 నవంబర్ 19న ఆస్ట్రేలియా చేతిలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో ఓటమి తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం భారీ విమర్శలు ఎదుర్కొంది. ఈ పిచ్ నెమ్మదిగా ఉండడం వల్ల తొలి ఇన్నింగ్స్లో బ్యాటర్లు రన్స్ సాధించడం చాలా కష్టమనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో టాస్ అనేది కీలకంగా మారింది.
ఇది కూడా చదవండి..: T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మధ్య టైటిల్ పోరు

