అక్షరటుడే, వెబ్డెస్క్ : India War Challenges | పశ్చిమాసియాలో యుద్ధం భారత్కు సవాళ్లు తీసుకొచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. సోమవారం ఆయన లోక్సభలో ప్రసంగించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ దిగుమతులపై ప్రకటన చేశారు.
పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మోదీ అన్నారు. ప్రపంచం మీద యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో కోటి మంది భారతీయులు (Indians) ఉన్నారని తెలిపారు. యుద్ధంలో చిక్కుకున్న భారత పౌరులను రక్షించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇప్పటి వరకు 3.75 లక్షల మందిని సురక్షితంగా భారత్కు తరలించామన్నారు. ఇరాన్ నుంచి 1000 మందిని తీసుకొచ్చినట్లు చెప్పారు.
India War Challenges | కొరత లేకుండా చర్యలు
ప్రజలకు పెట్రోల్, గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు ప్రధాని తెలిపారు. 60 శాతం LPGని భారత్లో ఉత్పత్తి చేస్తున్నామన్నారు. 41 దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రైల్వేల విద్యుదీకరణతో 180 కోట్ల డీజిల్ ఆదా చేశామన్నారు. హార్మూజ్ జలసంధి నుంచి మన నౌకలు సురక్షితంగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
India War Challenges | ఆర్థిక మాంద్యం ముప్పు
ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు పొంచి ఉందని మోదీ అన్నారు. భారత్పై దాని ప్రభావం లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.ఖరీఫ్ సీజన్లో రైతులకు డీజిల్ కొరత (Diesel Shortage) లేకుండా చూస్తామని తెలిపారు. పవర్ప్లాంట్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు.
India War Challenges | యుద్ధం ఆపాలి
యుద్ధ ప్రభావం చాలా కాలం పాటు ఉంటుందని మోదీ అన్నారు. సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ యుద్ధాని ఆపాలని కోరారు. ఈ యుద్ధం మానవాళి ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. యుద్ధాన్ని శాంతియుతంగా ముగించాలని భారత్ అన్ని పక్షాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. పశ్చిమ ఆసియా నాయకులందరితో మాట్లాడినట్లు తెలిపారు. ఈ యుద్ధాన్ని ముగించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
ఇది కూడా చదవండి..: LPG Ship India | గ్యాస్ కష్టాలకు చెక్… భారత్కు చేరిన మరో ఎల్పీజీ నౌక

