అక్షరటుడే, వెబ్డెస్క్ : Indian Stock Market | అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. గ్యాస్, క్రూడ్ ఆయిల్ (Crude Oil) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతోంది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 100 డాలర్లపైనే ఉండడం, ఎఫ్ ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండడంతో మన మార్కెట్లు కుదేలవుతున్నాయి. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది.
Indian Stock Market | నష్టంతో ప్రారంభమై
సోమవారం ఉదయం సెన్సెక్స్ 148 పాయింట్ల నష్టంతో ప్రారంభమై వెంటనే కోలుకుని 568 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడడంతో ఒక్కసారిగా 1,034 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 168 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 329 పాయింట్లు పడిపోయి ఒకదశలో 23 వేల పాయింట్ల దిగువకు వచ్చింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి.

Indian Stock Market | 183 పాయింట్ల లాభంతో
ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 183 పాయింట్ల లాభంతో 74,747 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 23,211 వద్ద కదలాడుతున్నాయి.
నిఫ్టీలో మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ ఇండెక్స్లు మాత్రమే లాభాలతో ఉన్నాయి. రియాలిటీ ఇండెక్స్ 2.17 శాతానికిపైగా నష్టంతో ఉండగా.. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, మీడియా, యుటిలిటీ ఇండెక్స్లు ఒక శాతానికిపైగా నష్టంతో కదలాడుతున్నాయి.
Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో 17 స్టాక్స్ లాభాలతో ఉండగా.. 13 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 3.45 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.87 శాతం, టాటా స్టీల్ 1.58 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.23 శాతం, ఇండిగో 1.13 శాతం లాభాలతో ఉన్నాయి.
Top losers : బీఈఎల్ 2.45 శాతం, పవర్గ్రిడ్ 1.56 శాతం, ఇన్ఫోసిస్ 1.52 శాతం, సన్ఫార్మా 1.28 శాతం, టీసీఎస్ 1.24 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: March 15 Gold Rates | బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!

