అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Houses Kamareddy | కామారెడ్డిలో (Kamareddy News) ఆనాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) 2023 మార్చి 18న పాదయాత్ర చేపట్టారు. కామారెడ్డి నుంచి రాజాంపేట వెళ్తున్న క్రమంలో చిన్నమల్లారెడ్డి (Chinnamallareddy Village) (Telangana Government) గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు చిట్యాల రాజమని, భిక్కనూరు లక్ష్మిలకు చెందిన నివాసగృహాలు కూలిపోయాయి.
Indiramma Houses Kamareddy | బాధితుల ఆవేదనను విన్న రేవంత్రెడ్డి..
పాదయాత్ర సందర్భంగా నిరాశ్రయులైన బాధితులు తమ ఆవేదనను రేవంత్ రెడ్డికి వివరించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని(Congress Government Telangana), నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇళ్లు వారికే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం బాధితులకు ఇళ్లు మంజూరు కావడంతో పాటు ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. శనివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) చేతుల మీదుగా గృహప్రవేశం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్ విడుదల

