అక్షరటుడే, వెబ్డెస్క్: Induru Tirumala Brahmotsavam | నిజామాబాద్ జిల్లా నర్సింగపల్లి ఇందూరు తిరుమలలో 12వ (పుష్కర) బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసచార్యులు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.
Induru Tirumala Brahmotsavam | గ్రామస్థుల శ్రమదానంతో..
నర్సింగ్ పల్లి గ్రామస్థుల శ్రమదానంతో.. శ్రీమాన్ నరసింహారెడ్డి సంకల్ప బలంతో, దిల్ రాజు కుటుంబ సభ్యుల అకుంఠిత దీక్షతో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఆలయం నిర్మాణం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా “పుష్కర బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు.
ఇందూరు తిరుమల ఆలయానికి స్వామివారు వేంచేసి పన్నెండు సంవత్సరాలు పూర్తయి పదమూడో సంవత్సరంలో అడుగిడుతున్న శుభ సందర్భంగా పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు రోహిత్ కుమారాచార్య పేర్కొన్నారు. ఆలయం నిర్మించి పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాక స్వామివారి ప్రాభవం రెట్టింపుగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ఆలయ ధర్మకర్తలు నర్సింహా రెడ్డి, విజయసింహారెడ్డి, సంపత్ కుమారాచార్య, రోహిత్ కుమారాచార్య, నరాల సుధాకర్, నర్సారెడ్డి, రమేష్, మురళి, భాస్కర్, సురేష్, గంగారెడ్డి, సాయిలు, సాయి, గ్రామస్థులు పాల్గొన్నారు.

