అక్షరటుడే, వెబ్డెస్క్ : Iran Drone Attacks | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్లోని ఖార్గ్ ద్వీపం (Kharg Island)పై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై భారీగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. దీంతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది.
పశ్చిమాసియా యుద్ధంలో మొదటిసారి సెజ్జిల్ను ఇరాన్(Iran) ప్రయోగించింది. సెజ్జిల్ అనేది స్వదేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన ఘన ఇంధనంతో పని చేసే రెండు దశల బాలిస్టిక్ క్షిపణి. దాదాపు 700 కిలోల పేలోడ్ల సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి 2 వేల కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేరుకోగలదు.
Iran Drone Attacks | అమెరికా దాడులు
ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్లోని కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా (America) దళాలు అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు చేపట్టాయి. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా రగిలిపోతుంది. మరోవైపు ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తోంది. దుబాయ్, బాగ్దాద్ ఎయిర్పోర్ట్ల లక్ష్యంగా డ్రోన్, మిస్సైల్ దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్ను సైతం లక్ష్యంగా చేసుకుంది.
ఇది కూడా చదవండి..: Taliban Drone Attacks | పాక్పై డ్రోన్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు..

