అక్షరటుడే, వెబ్డెస్క్ : Iran US conflict | అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో కీలక నేతలను కోల్పోతున్నా.. ఇరాన్ మాత్రం ప్రతీకార దాడులను ఆపడం లేదు. పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. అంతేగాకుండా ఇటీవల అమెరికా యుద్ధ విమానంపై సైతం ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా రూ.కోటి విలువ చేసే క్షిపణితో అమెరికాకు చెందిన రూ.5,600 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసింది.
సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇటీవల ఇరాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన E-3 Sentry AWACS దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. Boeing తయారు చేసిన ఈ ఎయిర్క్రాఫ్ట్ విలువ సుమారు రూ.5,600 కోట్లు ఉంటుందని సమాచారం. 250 మైళ్ల పరిధిలో రాడార్తో శత్రు కదలికలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ దాడిలో 10 మందికి పైగా సైనికులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పాటు ఇతర విమానాలు సైతం దెబ్బతిన్నాయి. అందులో గగనతల ఇంధన ట్యాంకర్లు కూడా ఉన్నాయి.
Iran US conflict | మార్చి 27న దాడి
గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ (Iran) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 27న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ (Prince Sultan Air Base)పై క్షిపణిని ప్రయోగించింది. దీతో ఒక E-3 విమానానికి భారీగా నష్టం వాటిల్లినట్లు ‘ఎయిర్ & స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్’ తెలిపింది. ఈ ఘటనకు ముందు ఆ ఎయిర్ బేస్లో ఆరు E-3 విమానాలు మోహరించి ఉన్నాయి. మార్చి 27న జరిగిన ఇరాన్ దాడిలో ఒక యూఎస్ఏఎఫ్ ఈ-3 విమానం, ట్యాంకర్లు దెబ్బతిన్నాయని తెలిసింది.
Iran US conflict | ఇరాన్ వ్యూహాత్మక దాడులు
అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్పై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ టెహ్రాన్పై దాడులను కొనసాగిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. కీలక నేతలు చనిపోతున్నా ఐఆర్జీసీ వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. దుబాయిలోని థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంను కూడా ఇరాన్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా అమెరికాకు చెందిన ఎఫ్–35 విమానంపై దాడి చేయడంతో అది అత్యవసరంగా ల్యాండ్ అయింది.
దీనిని కూడా చదవండి : Ethanol Usage India | ఇథనాల్ వాడకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
