అక్షరటుడే, వెబ్డెస్క్ : Israel Iran Attacks | మరో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. శనివారం క్షిపణులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్పై విరుచుకుపడింది. దీంతో భారీ పేలుళ్లు చోటు చేసుకోవడంతో టెహ్రాన్లో పాఠశాలలు, కార్యాలయాలు మూసివేశారు.
ఇప్పటికే ప్రపంచ దేశాలో పలు యుద్ధాలతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్ –గాజా, పాకిస్థాన్–అఫ్ఘానిస్థాన్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం మరో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జూన్లో ఇజ్రాయెల్, ఇరాన్ 12 రోజుల వైమానిక యుద్ధంలో పాల్గొన్నాయి. అనంతరం రెండు దేశాలు సీజ్ఫైర్కు అంగీకరించాయి. ఇరాన్ తన అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలతో ముందుకు సాగితే వారు మళ్లీ దాడి చేస్తామని అమెరికా-ఇజ్రాయెల్ పదేపదే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి.
Israel Iran Attacks | ముప్పును తొలగించడానికి..
తమ దేశానికి ముప్పును తొలగించడానికి ఇరాన్పై ముందస్తు దాడిని ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అన్నారు. శనివారం టెహ్రాన్ (Tehran)లో పేలుళ్లు వినిపించాయని ఇరాన్ పేర్కొంది. కాగా ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకోవాలని చూస్తోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దానిని అడ్డుకుంటున్నాయి. ఈ విషయంలో ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇందులో గతంలో ఇజ్రాయెల్ ఇరాన్లోని అణుస్థావరాలపై దాడులు చేసింది. ఆ సమయంలో రెండు దేశాలు దాడులు చేసుకున్నాయి. తాజాగా మరోసారి ఇరాన్ దాడులకు దిగడంతో ఇరాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ధ్రువీకరించింది.
Israel Iran Attacks | ఎయిర్ స్పేస్ మూసివేత
ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరించింది. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. తమ ఎయిర్ స్పేస్ మూసి వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి..: Travel Advisory | ఇరాన్లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ

