అక్షరటుడే, హైదరాబాద్: IT Job Layoffs | ప్రపంచ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య ఉద్రిక్తతలతో పాటు కృత్రిమ మేధస్సు (AI) వేగంగా విస్తరించడం వల్ల ఐటీ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా అనేక ఐటీ దిగ్గజ కంపెనీలు తమ సంస్థలను పునర్వ్యవస్థీకరించుకుంటూ ఉద్యోగులను భారీగా తగ్గిస్తున్నాయి.
IT Job Layoffs | భారీగా ఉద్యోగ కోతలు
తాజా నివేదికల ప్రకారం 2026 ప్రారంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే 30 వేలకుపైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. 2025లో అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.45 లక్షల మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
IT Job Layoffs | ఏఏ కంపెనీలు ఎంతమందిని తొలగించాయంటే..
ఇటీవల ప్రముఖ టెక్ కంపెనీలు తీసుకున్న ఉద్యోగ కోతల వివరాలను పరిశీలిస్తే..
- Amazon – దాదాపు 16,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
- Microsoft – సుమారు 9,000 మంది ఉద్యోగులను తగ్గించింది.
- Intel – సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 వేల వరకు ఉద్యోగాలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
- TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) – దాదాపు 19,700 మందికి పైగా ఉద్యోగాలను తగ్గించింది.
- Accenture – సుమారు 11,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
- Atlassian – ఏఐ దిశగా మార్పుల నేపథ్యంలో 1,600 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
- Block (ఫిన్టెక్ కంపెనీ) – సుమారు 4,000 ఉద్యోగాలు తగ్గించినట్లు తెలిసింది.
- WiseTech Global – దాదాపు 2 వేల మంది ఉద్యోగులు తొలగించబడ్డారు.
- Livspace – సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వెయ్యి మంది ఉద్యోగాలను కోల్పోయారు.
- ఒరాకిల్ – ఇటీవలే ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
IT Job Layoffs | ఏఐ ప్రభావం
ఐటీ రంగంలో జరుగుతున్న ఉద్యోగ కోతలకు ప్రధానంగా AI తోపాటు ఆటోమేషన్ కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పనులు చేయగలిగే టెక్నాలజీలపై కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే సంప్రదాయ ఐటీ ఉద్యోగాల అవసరం తగ్గుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
IT Job Layoffs | భారత ఐటీ రంగం పరిస్థితి..
ప్రపంచ మార్కెట్ మందగమనంతో పాటు విదేశీ క్లయింట్ల ద్వారా వచ్చే ప్రాజెక్టులు తగ్గడం వల్ల భారత ఐటీ రంగం తీవ్ర ప్రభావానికి గురవుతోందని చేస్తోంది. ఈ నేపథ్యంలో బడా ఐటీ కంపెనీలు సైతం కొత్త నియామకాలను తగ్గించి, కొన్నిచోట్ల ఉద్యోగులను తగ్గించే మార్గంలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
IT Job Layoffs | భవిష్యత్తులో మరిన్ని మార్పులు తప్పవా..
కాగా, ఐటీ రంగంలో పూర్తిగా ఉద్యోగాలు తగ్గిపోవడం ఉండదని నిపుణులు చెబుతున్నారు. AI, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ లెక్కన సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపర్చుకోకుంటే.. భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
నవంబరు తర్వాత ఏమి జరగబోతోంది..?
నవంబర్ తర్వాత ఐటీ రంగంలో మరిన్ని మార్పులు రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని కారణాలు లేకపోలేదు. ఇందులో ప్రపంచ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, AI ప్రభావం, కంపెనీల బడ్జెట్ సైకిల్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
కొత్త బడ్జెట్ సైకిల్
- అంతర్జాతీయంగా చాలా ఐటీ కంపెనీల ఫైనాన్షియల్ ఇయర్ (FY) అక్టోబరు – నవంబరు ప్రారంభమవుతాయి. అంటే ఆ సమయానికి కొత్త ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రారంభిస్తాయన్నమాట.
- ఈ క్రమంలోనే పలు ఐటీ కంపెనీలు వచ్చే ఏడాది ఖర్చులు తగ్గించేందుకు ముందుగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లేదా బృందాలను రీస్ట్రక్చర్ చేయడం వంటివి చేపడతాయి.
- అందుకే నవంబరు నుంచి layoffs కానీ, restructuring కానీ ఎక్కువగా ఉంటాయి.
AI – ఆటోమేషన్ వేగం:
- 2025 – 26లో AI టెక్నాలజీలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. ఇంకా కొత్తవి వస్తూనే ఉన్నాయి.
- కోడింగ్, డేటా అనాలిసిస్, టెస్టింగ్ వంటి పనుల్లో AI tools ఎక్కువగా వినియోగిస్తున్నారు.
- ఒకప్పుడు 10 మంది ఉద్యోగులు చేసే పని.. ఇప్పుడు 3–4 మంది + AIతో చేయించే పరిస్థితి వచ్చింది.
దీంతో కొన్ని సంప్రదాయ ఐటీ ఉద్యోగాల అవసరం తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
భారత ఐటీ రంగానికి ప్రధానంగా అమెరికా, యూరప్ నుంచి ప్రాజెక్టులు వస్తాయి. అయితే అక్కడి కంపెనీలు ప్రస్తుతం మాంద్యం భయం, వడ్డీ రేట్లు, జియోపాలిటికల్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ప్రాజెక్టులు తగ్గితే భారత ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం తప్పదు.
జియోపాలిటికల్ ఉద్రిక్తతలు
మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు.. ప్రపంచ మార్కెట్లను అస్థిరంగా చేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు టెక్ ప్రాజెక్టులపై ఖర్చు తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి.

