అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Jyoti rao Phule | మహాత్మా జ్యోతిరావు పూలేను భారతరత్న (Bharat Ratna) పురస్కారంతో గౌరవించాలని ఉర్దూ అకాడమీ (Urdu Academy) ఛైర్మన్ తాహెర్బిన్ హందాన్ (Taher bin Handan) అన్నారు. సిరికొండలోని సత్యశోధక్ పాఠశాలలో శనివారం జ్యోతిరావు పూలే (Jyoiba phule) జయంతి వేడుకలతో పాటు పాఠశాల రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Jyoti rao Phule | సామాజిక స్వేచ్ఛతోనే నిజమైన స్వాతంత్య్రం..
ముఖ్య అతిథిగా విచ్చేసిన తాహెర్ మాట్లాడుతూ.. పూలే దృష్టిలో నిజమైన స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదని, సామాజిక స్వేచ్ఛ కూడా అని పేర్కొన్నారు. ఉన్నత విద్యా మండలి (Council for Higher Education) మాజీ ఛైర్మన్ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ.. పూలే చూపిన దారిలో నడవాలంటే ముందుగా మనలోని వివక్ష భావాలను తొలగించుకోవాలని హితవు పలికారు. సమానత్వం, మానవత్వం అనే విలువలను మనమే ఆచరణలో పెట్టాలన్నారు.
Jyoti rao Phule | సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో..
సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ సలహాదారు, పూలే–అంబేడ్కర్ ఆలోచన వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య ఎంఏ మహమ్మద్ అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ సృజనాత్మక వినాశ సిద్ధాంతం (Creative Destructive Theory) గురించి వివరించారు. దేశం అభివృద్ధి చెందాలంటే పాత వ్యవస్థను తొలగించే సృజనాత్మక వ్యవస్థను రూపొందించాలని, ఆ బాధ్యత నేటి యువతపై ఉందని పేర్కొన్నారు. ఇటీవలే ప్రొఫెసర్గా పదోన్నతి పొందిన డా. మహమ్మద్ అబ్దుల్ మాలిక్ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సత్యశోధక్ పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ ఆర్. నర్సయ్య, తెలంగాణ కాలేజియేట్ సంయుక్త సంచాలకులు ఆచార్య. బాలభాస్కర్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫోరం అధ్యక్షులు వీజీఆర్ నారగోని, సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ సలహాదారు అడ్వకేట్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Monsoon Rainfall Deficit | రైతులకు అలెర్ట్.. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే
