అక్షరటుడే, కామారెడ్డి: Jyotiba Phule Jayanti | కామారెడ్డిలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి (Jyotiba Phule Jayanti) వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి (Kamareddy news) మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా వేడుకలు జరిపారు.
Jyotiba Phule Jayanti | ప్రజాసంఘాలు.. రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో..
ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జ్యోతిబా పూలే విగ్రహానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir ali), జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి (Ippa Umarani), టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీఎన్జీవోస్ (TNGOs Kamareddy) జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: De-Addiction Center | డ్రగ్స్ రహిత సమాజం కోసం డీఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు: ఎస్పీ రాజేష్ చంద్ర
