అక్షరటుడే, వెబ్డెస్క్: Kakatiya Medical College | వరంగల్ (Warangal)లోకి కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. 20 మంది జూనియర్లను సీనియర్లు గోడ కుర్చీ వేయించారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం విద్యార్థులు సెకండిర్ స్టూడెంట్స్ను ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన కాలేజీ అధికారులు విద్యార్థులపై చర్యలకు సిఫార్స్ చేశారు. దీంతో ఏడుగురు థర్డ్ ఇయర్ విద్యార్థులను ఆరునెలల పాటు సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సంధ్య ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కోర్సు పూర్తయ్యే వరకు కాలేజీ హాస్టల్లో ఉండటానికి వీలు లేదని చెప్పారు.
Kakatiya Medical College | ఏం జరిగిందంటే..
కాలేజీలో సెకండియర్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు పదిరోజుల క్రితం గొడవ జరిగింది. అనంతరం ఇరువర్గాల వారు రాజీకి వచ్చారు. అయితే ఈ గొడవపై జూనియర్లు సీనియర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు సీనియర్లు చూడటంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో మార్చి 29న సెకండియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారు.
Kakatiya Medical College | వీడియో రికార్డు
సీనియర్లు సెకండియర్ విద్యార్థులను హాస్టల్ భవనంపైకి పిలిపించారు. వాట్సాప్ పోస్టులపై ప్రశ్నించారు. అంతేగాకుండా మోకాళ్లపై కూర్చొబెట్టారు. మరోసారి ఇలా చేయమని క్షమాపణ చెప్పించారు. జూనియర్లను పలు రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయితే సెకండిర్ విద్యార్థి ఒకరు ఈ ర్యాగింగ్ను వీడియో తీశారు. ఆ వీడియోను జాతీయ వైద్య మండలి ఫిర్యాదుల పోర్టల్కు పంపించారు. ఎన్ఎంసీ అధికారులు (NMC Officers) ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ విచారణ చేపట్టారు. విచారణలో ర్యాగింగ్ చేసిన విషయం నిజమేనని తేలడంతో బాధ్యులైన ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
