Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kaleshwaram Project Controversy | కాళేశ్వరంతో రూ.లక్ష కోట్లు వృథా.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kaleshwaram Project Controversy | కాళేశ్వరంతో రూ.లక్ష కోట్లు వృథా.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ

Kaleshwaram Project Controversy | కాళేశ్వరంతో రూ.లక్ష కోట్లు వృథా.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అవినీతిపై కేంద్ర మంత్రి సీఆర్​ పాటిల్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 8:18 సా.
Srinivas Kolluri
4 గంటలు ago
Share
Kaleshwaram Project Controversy

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Project Controversy | కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అవినీతి, అక్రమాలపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ (CR Patil) సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కాళేశ్వరం వైఫల్యానికి ప్రణాళిక, రూపకల్పనలో ఉన్న తీవ్రమైన లోపాలే కారణమని పేర్కొన్నారరు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు. బ్యారేజీ కుంగిపోవడంపై ప్రస్తుతం కేంద్ర కమిటీ విచారణ జరుపుతోందన్నారు. జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission) నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kaleshwaram Project Controversy | పనులు చేయలేదు

గత మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క ప్రతిపాదనను కూడా సమర్పించలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కింద భారీగా రూ.873 కోట్ల నిధులు చేతిలో ఉన్నప్పటికీ, కేవలం రూ.194 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) కింద తెలంగాణ నుంచి కొత్త సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలేవీ అందలేదని ఆయన వెల్లడించారు.

కాగా బీఆర్​ఎస్​ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్​ మూడేళ్లకే కుంగిపోయిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోష్​ కమిషన్ వేసింది. అనంతరం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించింది. అయితే ఈ కేసులో విచారణ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి పాటిల్​ కాళేశ్వరంలో భారీగా ప్రజాధనం వృథా అయిందని చెప్పడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Maoist Leader Surrender | లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Disabled Protest Support | దివ్యాంగుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు..
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
Telangana EAPCET Cancellation | ఈఏపీసెట్​ రద్దు చెయ్యాలని తెలంగాణ విద్యా కమిషన్​ సిఫారసు.. మెరిట్​, పారదర్శకతకు పెద్ద దెబ్బనే!
TAGGED:CR Patil statementKaleshwaram projectproject controversytelangana irrigationwater resources India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Tadwai Auto Accident | Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి
Next Article Advocate Protection Act | Advocate Protection Act | పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి..: అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?