అక్షరటుడే, వెబ్డెస్క్: Kavitha New Party | జోగులాంబ గద్వాల నుంచే తాను కొత్త పార్టీ ప్రారంభిస్తానని (Kavitha New Party) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో సోమవారం నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ కార్యక్రమమైనా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్లో ప్రారంభమయ్యేదని గుర్తు చేశారు. కానీ.. తాను భవిష్యత్లో ఏర్పాటు చేయనున్న పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా కూడా జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభిస్తానని తెలిపారు. ఈ గడ్డపై నుంచి ఎలాంటి పని చేసినా జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కవిత అన్నారు.
Kavitha New Party | ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ
వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఎవరు ఏం ఇచ్చినా.. తీసుకోవాలని సూచించారు. కానీ పని చేసే వారికి మాత్రమే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తే తీసుకోవాలని.. కానీ ఓటు మాత్రం జాగృతికే వేయాలని కోరారు. ప్రతి మండలంలో జెడ్పీటీసీలను బరిలో నిలబెడతామని కవిత తెలిపారు.
బీఆర్ఎస్ మోసం..
బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డ ప్రాంతాన్ని మోసం చేసిందని కవిత విమర్శించారు. ఈ గడ్డకు నీళ్లు ఇవ్వడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయని మండిపడ్డారు. రాజకీయ శక్తిగా కొత్తగా వచ్చే (Kavitha New Party) తాము నడిగడ్డకు నీళ్లు తెస్తామన్నారు. ఈ ప్రాంతంలో తుంగభద్ర, కృష్ణ నదులు పారుతున్నా.. నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల ఎమ్మెల్యేకు దమ్ముంటే.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బకాయిలు వెంటనే చెల్లించాలి
ఆడవాళ్లు లేనిదే వ్యవసాయం లేదని కవిత అన్నారు. మహిళా రైతులు ఓ వైపు ఇల్లు, మరోవైపు వ్యవసాయం చూసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఎంతో కష్టపడి రైతులు పంటలు పండిస్తుంటే.. దళారులు వారిని దగా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల జిల్లాలో సీడ్ పత్తి రైతులను దళారులు మోసం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్ పత్తి రైతుల బకాయిలను వారం రోజుల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

