అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy 38th Ward | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality)లోని 38వ వార్డులో దొంగ ఓట్లతోనే ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి, ప్రస్తుతం మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి గెలిచారని ప్రత్యర్థి అభ్యర్థి రంగ మాధవి ఆరోపించారు. ఈ మేరకు తన నివాసంలో ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు.
Kamareddy 38th Ward | ముఖ్య నాయకుడి సోదరుడే కారణం..
కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) తనకు టికెట్ కేటాయించిందని, స్వతంత్ర అభ్యర్థిగా ఇప్ప ఉమారాణి పోటీ చేశారన్నారు. అయితే తమ పార్టీ ముఖ్య నాయకుడి సోదరుడు అందరికి ఫోన్చేసి పార్టీ టికెట్ ఇచ్చినా స్వతంత్ర అభ్యర్థే మన అభ్యర్థి అని వారికే ఓటు చేయాలని చెప్పారని ఆరోపించారు. ఛైర్మన్ ఉమారాణి స్వగ్రామం రాజంపేట (Rajampet) అని, ఆ గ్రామం నుంచి కొంతమందికి 38వ వార్డులో ఓటు హక్కు కల్పించారన్నారు. రాజంపేట ఉప సర్పంచ్గా ఉన్న మీర్ ఇమ్రాన్తో పాటు ఆ గ్రామానికి చెందిన 15 మంది, జంగంపల్లి గ్రామంలో (Jangampally Village) హిందీ పండిత్గా పనిచేస్తున్న అబ్దుల్ గపూర్ దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. అలాగే 40, 37, 39 ఇతర వార్డుల నుంచి 38వ వార్డులో ఓటు వేశారన్నారు.
Kamareddy 38th Ward | 50 దొంగ ఓట్లు..
తమ వార్డులో 5-8-11 నుంచి 5-8-18 నంబరు గల ఇళ్లపై 50 దొంగ ఓట్లు ఉన్నాయని, హిందువుల ఇళ్లపై ముస్లింల ఓట్లు చేర్చారని రంగ మాధవి అన్నారు. ఈ విషయమై జనవరి 8న మున్సిపల్ అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 250 డబుల్ ఓట్లు, 66 ఇతర వార్డుల ఓట్లు, 45 కమర్షియల్ షట్లర్లు, భవనాలపై ఉన్నాయన్నారు. కేటీఆర్ (KTR) వద్ద పర్సనల్ పీఏగా ఉన్న మాణిక్య మహేష్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి కజిన్ బ్రదర్ అని, దొంగ ఓట్ల వెనక ఆయన హస్తం ఉందని ఆరోపించారు. దొంగ ఓట్లను పోలింగ్ రోజు తమ ఏజెంట్లు గుర్తించి అడ్డుకున్నారని, ఓటర్ ఐడీతో రావడంతో ఓటరు అతనే కదా అని అధికారులు పట్టించుకోలేదన్నారు.
Kamareddy 38th Ward | భార్యాభర్తల కంటతడి..
పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా గ్రూప్ తగాదాలతో తాము అన్యాయానికి గురయ్యామని భార్యాభర్తలు కంటతడి పెట్టుకున్నారు. తమకు ఓట్లేసి సహకరించిన వారికి ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో గెలిచిన ఇప్ప ఉమారాణి ఎన్నికను సవాల్ చేస్తూ రీపోలింగ్ చేయాలని కోర్టును ఆశ్రయించామన్నారు. కౌన్సిలర్గా ఇప్ప ఉమారాణి ఎన్నికను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Hospital Toddy | ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కల్లు ప్కాకెట్ల కలకలం

