అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy RTC Bus | రోడ్డుపై ఓవర్టేక్ చేస్తూ వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు (RTC Bus Telanagana) ఢీకొంది. ఈ ఘటన సదాశివనగర్ మండలం మర్కల్ (adashivanagar Mandal) శివారులో మంగళవారం చోటుచేసుకుంది.
Kamareddy RTC Bus |కామారెడ్డి డిపో బస్సు..
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి (Kamareddy News) డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు (TSRTC Express Bus) నిజామాబాద్ నుంచి కామారెడ్డి వస్తోంది. సదాశివనగర్ మండలం మర్కల్ (adashivanagar Mandal) శివారులో బస్సు వెనకాల ఉన్న లారీ (Lorry Collision) రెండుసార్లు బస్సును ఓవర్ టేక్ చేసింది. ఈ క్రమంలో బస్సును తాకుతూ లారీ వెళ్లింది. దీంతో డ్రైవర్ వైపు బస్సు ముందుబాగం పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో (Road Safety India) కామారెడ్డి జీజీహెచ్ (Kamareddy GGH)కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ఉన్నట్టుగా సమాచారం.

ఇది కూడా చదవండి: Kamarreddy District Court | స్నేహితుడి హత్య కేసులో అన్నదమ్ములకు జీవిత ఖైదు

