అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SSC Exams | జిల్లాలో పదో తరగతి పరీక్షలు (kamareddy SSC exams) మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే ఆయా పరిక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. హాల్ టికెట్ నంబర్ ఏ గదిలో ఉందో (telangana board exam) తెలుసుకుని గదుల్లోకి వెళ్లారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.
Kamareddy SSC Exams | ఓఎంఆర్ షీట్పై అవగాహన
పరీక్ష కేంద్రంలో సుమారు 15 నిమిషాల పాటు ఓఎంఆర్ షీట్ ఎలా నింపాలనే విషయమై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లాలో (kamareddy district news) మొత్తం 13,154 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా మొదటిరోజు 13,117 మంది హాజరయ్యారు. 37 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Kamareddy SSC Exams | పరీక్ష కేంద్రాల వద్ద కళాశాలల ప్రచారాలు..
పదో తరగతి బోర్డు పరీక్షలు శనివారం ప్రారంభం కాగా కళాశాలల యాజమాన్యాలు పరీక్ష కేంద్రాలను కూడా వదల్లేదు. ఇప్పటికే వారివారి కళాశాలలకు సంబంధించిన వివరాలు చెప్పడానికి అన్ని గ్రామాలను కళాశాలల యాజమాన్యాలు చుట్టుముట్టాయి. పాఠశాలల నుంచి విద్యార్థుల వివరాలు, వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకుని రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తున్నారు. తాజాగా పరీక్ష కేంద్రాల (exam centers kamareddy) వద్ద విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాలలకు (education news telangana) సంబంధించిన పత్రాలు, బుక్లెట్లను అందజేయడం పలువురు తల్లిదండ్రులకు చికాగు తెప్పించింది. తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తున్నారోనని ఓవైపు తాము టెన్షన్ పడుతుంటే తమ స్వలాభం కోసం యాజమాన్యాలు చేపడుతున్న(college promotions issue) ప్రచారాన్ని పలువురు తప్పుబట్టారు. పరీక్షల చివరిరోజు ఈ రకమైన విధానాన్ని ఎంచుకుంటే తప్పు లేదని, ఇప్పుడు ఇలా చేయడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పరీక్ష కేంద్రాల వద్ద ఇలాంటి ప్రచారాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Auto Accident Deaths | ఆటో ఢీకొని ఇద్దరు దుర్మరణం

