అక్షరటుడే, కామారెడ్డి: Kamarreddy District Court | స్నేహితుడిపై హత్య కేసులో (Kamarreddy case) నిందితులకు న్యాయస్థానం శిక్ష విధించింది. ఇద్దరు నిందితులకు కామారెడ్డి కోర్టు జీవితఖైదు (District court judgement) విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించింది.
Kamarreddy District Court | పాల్వంచ మండలం ఆరేపల్లి..
పాల్వంచ (Palvancha mandal news) మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్, భువనగిరి మధు ఇద్దరు స్నేహితులు. అయితే నవీన్ ప్రవర్తన మధు కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా మారింది. కుటుంబ గౌరవం పోతుందని పద్ధతి మార్చుకోవాలని నవీన్కు మధు పలుమార్లు సూచించాడు. అయినా మారకపోవడంతో నవీన్ను అడ్డు తొలగించుకోవాలని భావించిన మధు తన అన్న ప్రభాకర్తో కలిసి హత్యకు పథకం పన్నాడు.
Kamarreddy District Court | పొలం నుంచి తిరిగి వస్తుండగా..
2024 మార్చి 26వ తేదీన నవీన్ తన భార్యను పొలం వద్ద వదిలి ఆటోలో తిరిగి వస్తుండగా రామేశ్వర్ పల్లి శివారులో (Telangana crime news) ఓ పొలం వద్ద అన్నదమ్ములు అడ్డగించి నవీన్ను పొలంలోకి లాక్కెళ్లి కూరగాయల కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ జరిపిన పోలీసులు సాక్షాధారాలు కోర్టులో సమర్పించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి (District court judgement) నిందితులైన అన్నదమ్ములకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర

