అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka Social Media Ban | కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు అసెంబ్లీలోసీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రకటించారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఫోన్లకు బానిసలు అయిపోతున్నారు. చిన్నారులు అన్నం తినాలన్నా ఫోన్లో వీడియోలు పెట్టాల్సిన పరిస్థితి. ముఖ్యంగా టీనేజీ యువత సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. దీంతో పలువురు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా (Social Media) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఫోన్ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ చర్యలు చేపట్టినట్లు సీఎం తెలిపారు. ఆయన శుక్రవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా బ్యాన్పై ప్రకటన చేశారు.
Karnataka Social Media Ban | పిల్లలను రక్షించడం కోసం..
ఫోన్ అధికంగా వాడటంతో యువ మనసులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ఆందోళన నేపథ్యంలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతికూల ప్రభావాల నుండి పిల్లలను రక్షించడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు సీఎం అన్నారు. డిజిటల్ పరధ్యానాలను తగ్గించడం, విద్యార్థులలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Karnataka Social Media Ban | గంటల కొద్ది..
ప్రస్తుతం పిల్లలు, విద్యార్థులు గంటల పాటు ఫోన్తో గడుపుతున్నారు. వీడియోలు చూస్తూ టైపాస్ చేస్తున్నారు. ముఖ్యంగా టీనేజీ పిల్లలు సోషల్ మీడియాలో చాటింగ్ల పేరిట మోసపోతున్నారు. బాలికలను కొందరు ప్రేమ పేరిట నమ్మించి మోసం చేస్తున్నారు సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం పిల్లల ఏకాగ్రత, నిద్ర విధానాలు, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుందని చాలా మంది నిపుణులు అంటున్నారు. ఇది చదువులు, శారీరక శ్రమ, కుటుంబం, స్నేహితులతో గడిపే సమయాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం నిషేధం అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి..: New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా

