అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha Budget Criticism | తెలంగాణ బడ్జెట్పై జాగృతి (Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. గత ఏడాది బడ్జెట్లో పొందుపర్చిన అంకెలను ఈ బడ్జెట్లో కాపీ పేస్ట్ చేశారని ఆరోపించారు.
తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కవిత మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ (Telangana Budget)లో తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. అన్ని వర్గాలకు అన్యాయం చేశారన్నారు. రైతుభరోసా, చేయూత పింఛన్లు సహా చాలా రంగాలకు గతేడాది కేటాయించిన నిధులనే అక్షరం మార్చకుండా అలాగే పెట్టారని తెలిపారు. ఏటా బీసీలకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ చెప్పారని, కానీ బడ్జెట్ లో మాత్రం 4 శాతం నిధులే కేటాయించారన్నారు.
Kavitha Budget Criticism | అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు
లక్షల కోట్లు అప్పులు తెస్తున్న రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ ఆ డబ్బులను ఏం చేస్తుందని కవిత ప్రశ్నించారు. దాదాపు 8 లక్షల 64 వేల కోట్లు అప్పు చేసి ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పుల భారం మోపిందన్నారు. అప్పులు తెచ్చినా ప్రజలకు మాత్రం పైసా మేలు జరగలేదని విమర్శించారు. మోదీ పెద్దన్న అంటూ ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా ఎందుకు తేలేదో చెప్పాలని నిలదీశారు.
Kavitha Budget Criticism | రాహుల్ ఫేక్
రాహుల్ గాంధీ హైదరాబాదీ సలీం ఫేక్ లాంటి వ్యక్తి అని కవిత ఎద్దేవా చేశారు. సలీం ఫేక్ తన మాటలతో కనీసం ప్రజలను నవ్విస్తాడన్నారు. రాహుల్ గాందీ తెలంగాణ ప్రజలను ఏడిపిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి పెద్ద ఎత్తున హామీలిచ్చిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. ఇక నుంచి రాహుల్ గాంధీకి రాహుల్ ఫేక్గా నామకరణం చేస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి : ATC Student Scholarship | ప్రభుత్వం గుడ్న్యూస్.. వారికి నెలకు రూ.2 వేల స్కాలర్షిప్

