అక్షరటుడే, వెబ్డెస్క్: Kavitha Delhi Liquor Case | ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జాగృతి ప్రధాన కార్యాలయంలో పలువురు నాయకులు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.
Kavitha Delhi Liquor Case | కడిగిన ముత్యంలా..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని కవిత తెలిపారు. తన తల్లిదండ్రులు, అత్తామామలు అండగా నిలిచారని గుర్తు చేశారు. కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. తనను మూడేళ్ల పాటు నానా మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారన్నారు. రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని నిరూపితమైందని చెప్పారు. తనకు అండగా నిలిచిన వారిని మరిచిపోనని కవిత అన్నారు.

Kavitha Delhi Liquor Case | నమ్మకం నిలబడింది
ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తాను గతంలోనే చెప్పినట్లు కవిత (Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. లిక్కర్ కేసుతో తాను, తన కుటుంబం కొన్ని నెలల పాటు క్షోభ అనుభవించామని ఆమె చెప్పారు. ఈ కేసులో కవిత ఐదున్నర నెలల పాటు జైలులో ఉన్నారు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చారు. తాజాగా కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో జాగృతి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
తప్పుడు కేసుతో తనను ఐదున్నర నెలల జైలులో పెట్టారన్నారు. ఆ సమయంలో కుటుంబానికి, పిల్లలకు దూరం చేశారన్నారు. దీనికి ఎవరు జవాబు చెబుతారని ప్రశ్నించారు. తీర్పు వచ్చిన తర్వాత తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. కేటీఆర్పై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.
ఇది కూడా చదవండి..: Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

