అక్షరటుడే, ఇందూరు: Kavitha Liquor Case | ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు (Kalwakuntla Kavitha) కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.
Kavitha Liquor Case | నిజం గెలిచింది..
ఈ సందర్భంగా జాగృతి అడ్హక్ కమిటీ (Telangana Jagruthi) ప్రతినిధులు మాట్లాడుతూ నిజం గెలిచిందన్నారు. సంబంధం లేని కేసులో కవితను ఇరికించి ఆమెను ఇన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. చివరకు అంతిమ విజయం కవిత వైపే నిలిచిందన్నారు.
కవిత పేరు డిశ్చార్జ్..
లిక్కర్ కేసుపై (Kavitha Liquor Case) తాజాగా విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) నిందితులపై నమోదు చేసిన కేసులు(Court Clean Chit) కొట్టేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండానే.. వీళ్ల పేర్లు కేసులో చేర్చారంటూ సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు తప్పు చేశారనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది.
లిక్కర్ పాలసీ..
ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్లో లిక్కర్ పాలసీ (Delhi Liquor Scam) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అనంతరం 2022 సెప్టెంబర్ చివరికి వెనక్కి తీసుకుంది. ఈ మధ్యలో లిక్కర్ విధానంలో అవకతవకలు జరిగాయని.. ఆప్ నేతలు మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇది కూడా చదవండి: Delhi Liquor Case Relief | ఢిల్లీ లిక్కర్ కేసు.. కేజ్రీవాల్, కవితకు బిగ్ రిలీఫ్

