అక్షరటుడే, వెబ్డెస్క్: Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు(82) కన్ను మూశారు. హైదరాబాద్ (Hyderabad)లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుది శ్వాస విడిచారు.
సాంబశివరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ఏలూరు జన్మించిన ఆయన కాంగ్రెస్ నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. మచిలీపట్నం, ఏలూరు నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. 2004, 2009లో ఏలూరు ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జౌళిశాఖ మంత్రిగా పని చేశారు.
Kavuri Sambasiva Rao | కాంగ్రెస్కు రాజీనామా
సాంబశివరావు తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ (Congress) నుంచి ప్రారంభించారు. సుదీర్ఘ కాలం ఆ పార్టీలో పని చేశారు. పార్టీకి సేవలు అందించడంతో కీలక పదవులు సైతం పొందారు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేశారు. అనంతరం 2014లో బీజేపీలో చేరారు. కావూరు వ్యాపార రంగంలో కూడా ఉన్నారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Kavuri Sambasiva Rao | కిషన్రెడ్డి సంతాపం
కావూరు సాంబశివరావు మృతిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) సంతాపం తెలిపారు. ఎక్స్ వేదికంగా ఆయన స్పందించారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సాంబశివరావు అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నట్లు పోస్టు పెట్టారు. 5 సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. రాజకీయంలో సాంబశివరావుకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో.. ప్రజాసమస్యలపై తన గళాన్ని వినిపించారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Telangana Speaker Decision | స్పీకర్ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత

