అక్షరటుడే, వెబ్డెస్క్ : Kerala Elections | కేరళ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఎలాగైనా దక్షిణాదిలో ప్రాబల్యం పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ (BJP) కేరళ, తమిళనాడు ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
పాలక్కాడ్లో ప్రధాని మాట్లాడుతూ.. కేంద్రం నిధుల్ని లెఫ్ట్ పార్టీ లూటీ చేసిందని విమర్శించారు. యూడీఎఫ్ (UDF), ఎల్డీఎఫ్ (LDF) కూటములు ఓటు బ్యాంకుపైనే ఫోకస్ పెట్టాయన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్షాలు పొత్తులో ఉన్నాయని పేర్కొన్నారు. కేరళలో మాత్రమే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఒకరినొకరు దూషించుకుంటున్నాయని తెలిపారు.
Kerala Elections | తీవ్ర విమర్శలు
కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు దశాబ్దాల పాలనలో రాష్ట్రాన్ని విఫలం చేస్తున్నాయని మోదీ అన్నారు. సర్దుబాటు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై విమర్శలు చేశారు. ఏ కూటమి అధికారంలో ఉన్నా.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రమే విశ్వసనీయమైన రాజకీయ ప్రత్యామ్నాయమని అభివర్ణించారు. కేరళ ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పు సుమారు రూ.5 లక్షల కోట్లకు చేరిందన్నారు.
దీనిని కూడా చదవండి : Ethanol Usage India | ఇథనాల్ వాడకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
