అక్షరటుడే, కోటగిరి : Kotagiri Incident | మానవత్వం మంటగలుస్తోంది. కన్నతల్లిపైనే కసాయి కొడుకు తన కర్కశత్వం చూపాడు. నవమాసాలు కనిపెంచిన తల్లిని దారుణంగా హింసించి కల్లుసీసాతో దాడిచేసి అనంతరం సజీవదహనం చేశాడు. ఈ హృదయ విదారక ఘటన కోటగిరి (Kotagiri)లో చోటు చేసుకుంది.
Kotagiri Incident | చెత్త సామాగ్రి సేకరించే వ్యక్తి..

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి గ్రామానికి చెందిన మానాజీ మద్యానికి బానిసై అతని తల్లి భూమవ్వ నిత్యం వేధించేవాడు..ఇటీవల ఆమెకు వచ్చిన పెన్షన్ డబ్బులు ఇవ్వాలని.. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని విక్రయించాలని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో మానాజీ శుక్రవారం రాత్రి మద్యం మత్తులో తల్లిపై కల్లుసీసాతో దాడిచేశాడు. ఆమె మృతిచెందిన అనంతరం మధ్యరాత్రి ఆమెను దహనం చేసేందుకు పాతదుస్తులను ఆమెపై వేసి నిప్పటించాడు. ఆమె భర్త సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇది కూడా చదవండి..: Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!

