అక్షరటుడే, వెబ్డెస్క్ : KP Sharma Oli Arrest | నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని కేపీ ఓలీ శర్మ అరెస్టయ్యారు. ఎన్నికలకు ముందు జరిగిన Gen-Z నిరసనలను అణచివేశారన్న కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొత్త ప్రధానిగా బలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, గత సంవత్సరం జరిగిన జెన్ జెడ్ (Gen Z) నిరసనలలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ (Former Nepal PM KP Sharma Oli)ని అరెస్టు చేశారు. భక్తపూర్లోని గుండులో ఉన్న ఆయన నివాసం నుంచి నేపాల్ పోలీసులు ఓలీని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ను కూడా శనివారం ఉదయం అరెస్టు చేశారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని కాఠ్మండు వ్యాలీ పోలీసు ప్రతినిధి ఓం అధికారి తెలిపారు.
KP Sharma Oli Arrest| చట్టానికి అతీతులు కారు
కొత్తగా నియమితులైన హోం వ్యవహారాల మంత్రి సుడాన్ గురుంగ్ మాట్లాడుతూ.. చట్టానికి ఎవరూ అతీతులు కారు అన్నారు. తాము మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇది ఎవరిపైనా ప్రతీకారం కాదని పేర్కొన్నారు. న్యాయానికి నాంది మాత్రమే అని చెప్పారు. ఇప్పుడు దేశం కొత్త దిశను తీసుకుంటుందని ఆయన తెలిపారు.
KP Sharma Oli Arrest| న్యాయపోరాటం చేస్తాను
తన అరెస్ట్పై కేపీ శర్మ ఓలీ ( KP Sharma Oli Arrest) స్పందిస్తూ.. కక్షపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 8, 9 తేదీలలో జరిగిన అవినీతి వ్యతిరేక యువజన ఉద్యమంలో కనీసం 19 మంది యువకులతో సహా 70 మందికి పైగా మృతి చెందారు. సోషల్ మీడియాపై విధించిన స్వల్పకాలిక నిషేధంతో ప్రారంభమైన ఈ ఉద్యమం, ఆర్థిక ఇబ్బందులపై దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆగ్రహాన్ని మరింత తీవ్రతరం చేసింది. మరుసటి రోజు పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడంతో ఈ అశాంతి దేశవ్యాప్తంగా వ్యాపించి కేపీ ఓలీ ప్రభుత్వం కూలిపోయింది.
KP Oli Sharma Arrest | కమిటీ ఏర్పాటు
ఇటీవల జరిగిన నేపాల్ పార్లమెంటరీ ఎన్నికలలో (Nepal Parliamentary Elections) ర్యాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా గెలిచిన విషయం తెలిసిందే. జెన్–జీ నిరసనల సమయంలో జరిగిన హింసపై విచారణ జరిపేందుకు ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం బాలేంద్ర షా అధ్యక్షతన నూతన ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది తిరుగుబాటు సమయంలో నిర్లక్ష్యం వహించినందుకు ఓలీ, లేఖక్లతో సహా బాధ్యులైన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ఉన్నత స్థాయి కమిషన్ విచారణ నివేదికను తక్షణమే అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయడం గమనార్హం.
ఇది కూడా చదవండి : Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

