Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్​ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్​ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్​

తెలంగాణ

Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్​ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్​

కాంగ్రెస్​ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేశారు. మూసీ ప్రాజెక్ట్​లో భాగంగా ఇళ్లు కోల్పోతున్న వారితో ఆయన మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 4:01 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Bulldozer Rajyam

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bulldozer Rajyam | రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇళ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం అని విమర్శించారు.

Contents
  • Bulldozer Rajyam | అండగా ఉంటాం
    • Bulldozer Rajyam | కాంట్రాక్టుల కోసమే..

మూసీ ప్రాజెక్టు (Musi project)లో భాగంగా ఇళ్లను, భూములను, అపార్ట్‌మెంట్లను కోల్పోతున్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని హైదర్ షా కోట్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులను కేటీఆర్​ ఆదివారం కలివారు. వారు నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తన పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

Bulldozer Rajyam | అండగా ఉంటాం

మూసీ బాధితులు తమ భూములను, ఇళ్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని కేటీఆర్​ సూచించారు. ఈ పోరాటంలో బీఆర్​ఎస్​ వారికి అండగా ఉంటుందన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇప్పటికే అద్భుతమైన ప్రగతి భవన్ సిద్ధంగా ఉన్నా దాన్ని కాదని చెప్పి రూ.200 కోట్లతో నివాసం నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఆయనకు వందల కోట్ల ఇళ్లు కావాలి కానీ పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్‌మెంట్ కూడా ఉండకుండా ఎందుకు ఈ విధ్వంసమని ప్రశ్నించారు.

Bulldozer Rajyam | కాంట్రాక్టుల కోసమే..

రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం, తన అనుచరులకు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారని కేటీఆర్​ ఆరోపించారు. ఇందుకోసం పేదల ఇళ్లను పణంగా పెడుతున్నారన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో రూ.16 వేల కోట్లతో ఒక్క ఇల్లు పోకుండా.. మూసీ సుందరీకరణకు డీపీఆర్ (DPR) సిద్ధం చేశామని చెప్పారు. దానిని పక్కన పెట్టి రేవంత్​రెడ్డి రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలో ఇళ్లు ఉన్నాయని ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఉన్న ఫార్మ్‌హౌస్‌లు, విల్లాలు, ఇళ్లను ఎందుకు ముట్టుకోవడం లేదని కేటీఆర్​ ప్రశ్నించారు.

musi

ఇది కూడా చదవండి : Sharada Peeth Demolition Row | శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర: హరీశ్​ రావు

Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్​..
TAGGED:BRS PartyBulldozer PoliticsHyderabad PoliticsKTRMusi ProjectMusi River DevelopmentRevanth ReddyTelangana Congress
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Babli Water Release | Babli Water Release | బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్ల ఎత్తివేత
Next Article Madiga Martyrs Day | Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?