అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Fire on Congress | కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మూసీలో ముంచుతున్న ఇండ్లకు జీరో వాల్యూ కాదని, రేవంత్ రెడ్డి సీఎం అయి చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ అన్నారు.
కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు, డిక్లరేషన్లకు, విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విలువ లేదని మండిపడ్డారు.నేనే రాజు.. నేనే మంత్రి అని గతంలో ఎగిరిపడిన వారు సంపద మూటగట్టుకుపోలేరని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఆరు గ్యారంటీల అమలు చేశామని 2023 గవర్నర్ ప్రసంగంలో ఉందన్నారు. కానీ ఏళ్లు గడిచినా ఆ హామీలు అమలు కావడం లేదన్నారు. తొలి మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారన్నారు.
KTR Fire on Congress | సిట్ వేయాలి
రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తొలి సంతకం చేసిన ఆరు గ్యారంటీల ఫైలు ఎటు పోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. FSL అగ్నిప్రమాదంలో కాలిపోయిందా అన్నారు. మాయమైన ఆరు గ్యారంటీల ఫైలు వెతికి కనిపెట్టేందుకు ఒక SIT వేయాలని ఎద్దేవా చేశారు. టీహబ్ అంటే చాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారేమోనని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు టీహబ్లోకి తరలించాలని అధికారులు ఆదేశించి మళ్లీ గంటల వ్యవధిలోనే ఆదేశాలు వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రికి తెలియకుండా ఆదేశాలు వస్తున్నాయని విమర్శించారు. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
KTR Fire on Congress | ఎవరు చెప్పింది నిజం
ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఐటీ ఉద్యోగాలు 9 లక్షల 39 వేలకు చేరుకున్నాయని గవర్నర్ ప్రసంగంలో చెప్పారన్నారు. 2023–24 సంవత్సరాల్లో 9 లక్షల 46 వేలు ఐటీ ఉద్యోగాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్పిందన్నారు. శ్రీధర్ బాబు ఏమో ఐటీ ఎగుమతులు 3 లక్షల 60వేల కోట్లు అన్నారని, అసలు ఏది నిజమని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి..: Kukatpally Cash Robbery | కళ్లలో కారం చల్లి.. రూ.21 కోట్లు ఎత్తుకెళ్లారు

