అక్షరటుడే, వెబ్డెస్క్ : Kukatpally Cash Robbery | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కూకట్పల్లిలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి వేళ బైక్ వెళ్తున్న వారిని దుండగులు అడ్డగించారు. వారి కళ్లలో కారం పొడి చల్లి రూ.కోటి నగదుతో పారిపోయారు.
బహదూర్పురా (Bahadurpura)కు చెందిన ఖుస్రూ, అజీముద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై రూ.21 కోట్ల నగదు ఉన్న బాక్సుతో వెళ్తున్నారు. బైక్పై వెళ్తున్న వీరిని సోమవారం రాత్రి కూకట్పల్లిలో దుండగులు అడ్డగించారు. అనంతరం కళ్లలో కారం పొడి చల్లి ఆ నగదు బాక్స్తో ఉడాయించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Kukatpally Cash Robbery | కిందపడిపోగానే..
ఖుస్రూ, అజీముద్దీన్ కూకట్పల్లిలోని పిల్లర్ నంబర్ 825 వద్ద ఓ కారులో నుంచి నగదు ఉన్న బాక్సు తీసుకున్నారు. అనంతరం బైక్పై పెట్టుకొని బయలు దేరారు. పిల్లర్ నంబర్ 836 వద్ద వారిని కొందరు అడ్డగించారు. కళ్లలో కారం చల్లారు. వారు కింద పడిపోగానే.. నిందితులు డబ్బులు ఉన్న బాక్స్ను తీసుకొని పారిపోయారు. అయితే డబ్బు తీసుకెళ్తున్నారనే పక్కా సమాచారంతో దుండగులు దారికాచి దోపిడీ చేశారు.
Kukatpally Cash Robbery | హవాలా డబ్బు..
డబ్బులు తీసుకొని వెళ్తున్న వారిని పోలీసులు విచారించారు. అంత డబ్బు ఎక్కడిది.. ఎక్కడకు తీసుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హవాలా డబ్బు తీసుకెళ్తుండగా చోరీ జరిగినట్లు గుర్తించారు. రూ.10 నోటు చూపించి ఓ వ్యాపారి దగ్గర ఏజెంట్లు రూ.21 కోట్ల నగదు తీసుకున్నారు. ఆ డబ్బులను డెలివరీ చేయడానికి వెళ్తుండగా.. చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం

