అక్షరటుడే, వెబ్డెస్క్ : Kukatpally Nalla Cheruvu | కూకట్పల్లి (Kukatpally)లోని నల్ల చెరువు ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) అధికారులను ఆదేశించారు. మార్చి 6 తర్వాత సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఈ చెరువును ప్రారంభిస్తారని చెప్పారు.
నగరంలోని పలు చెరువులను హైడ్రా (Hydraa) అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొచ్చినా.. హైడ్రా తాజాగా కూకట్పల్లి నల్లచెరువును పునరుద్ధరించింది. దీనిని బుధవారం హైడ్రా కమిషనర్ పరిశీలించారు. హైడ్రా మొదటివిడత చేపట్టిన ఆరు చెరువుల్లో ఇప్పటికె బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి ప్రారంభించారని చెప్పారు. నాలుగైదు రోజుల్లో పాతబస్తీలోని బమ్రుఖనుద్దౌలా చెరువుతో పాటు కూకట్పల్లి నల్లచెరువును ప్రారంభిస్తారని తెలిపారు.

Kukatpally Nalla Cheruvu | పార్కుల అభివృద్ధి
నల్ల చెరువు గట్టున నీడనిచ్చే మొక్కలు పెద్దమొత్తంలో నాటాలని హైడ్రా కమిషనర్ సూచించారు. STP ఏర్పాటుకు సంబంధించి జలమండలి (HMWS SB) అధికారులతో ఆయన మాట్లాడారు. 2024 సెప్టెంబర్లో ఈ చెరువు అభివృద్ధి పనులు మొదలు పెట్టామన్నారు. ఈ చెరువు వద్ద వాకింగ్, పిల్లలు ఆడుకోవడం, సేదదీరెందుకు ఐదారు కిలోమీటర్ల నుంచి వస్తున్నారని తెలిపారు. చెరువు వద్ద పిల్లల ఆడుకునే ఏరియాతో పాటు పార్కులు, ఓపెన్ జిమ్లు త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. చెరువు అభివృద్ధితో వరదలు తగ్గడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని హైడ్రా కమిషనర్ తెలిపారు.
ఇది కూడా చదవండి : Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

