అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Lifestyle Diseases Awareness | ప్రస్తుత జీవనశైలిలో మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మెడికవర్ హాస్పిటల్స్ జనరల్ ఫిజీషియన్ ఆనంద్ మాలు అన్నారు. ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(World Health Day) సందర్భంగా హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Lifestyle Diseases Awareness | ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన..
డాక్టర్ ఆనంద్ (General Physician Anand) మాలు మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) పిలుపు మేరకు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత జీవనశైలిలో మార్పులతో మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు. ఈ మేరకు మెడికవర్ హాస్పిటల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
Lifestyle Diseases Awareness | సమతుల్య ఆహారం తీసుకోవడంతో
ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. మధుమేహం (Diabetes), రక్తపోటు వంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా, నిరంతర వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా శరీరానికి తగినంత నీరు తీసుకోవడం, జంక్ ఫుడ్ను తగ్గించడం అవసరమని తెలిపారు. అనంతరం ఫిజీషియన్ అంజలి మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం చేయాలని సూచించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదని, ముఖ్యంగా మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ స్వామి, డీఎంఎస్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై సీసీఎస్ పోలీసుల మెరుపుదాడి
