అక్షరటుడే,లింగంపేట: Lingampet wrestling competitions | మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు (Wrestling Competitions) ఆకట్టుకున్నాయి. కొబ్బరికాయ కుస్తీ మొదలుకొని రూ.100, రూ.200, రూ.500 నుంచి రూ.2వేల వరకు, వెండి కడియం వరకు పోటీలు నిర్వహించారు.
Lingampet wrestling competitions | నాందేడ్ నుంచి సైతం..
ఈ పోటీల్లో తలపడేందుకు లింగంపేట, (sports news) గాంధారి, బాన్సువాడ, మద్నూర్, జుక్కల్, నాందేడ్, (traditional games)హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు(Telangana events) తరలివచ్చారు. చివరికి కడెం కుస్తీ విజేత మహారాష్ట్రలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన అవినాష్ గెలుపొందడంతో ఆలయ కమిటీ సభ్యులు రెండున్నర తులాల వెండి కడియం బహుకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కౌడరవి, ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు దుర్శటి అశోక్, ఎస్సై దీపక్ కుమార్, బీజేపీ లింగంపేట మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్, చేపూరి పోశెట్టి, మారుతి, ముదాం సాయిలు, గుండా బాలకిషన్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana minorities issue | మైనారిటీలకు మొండిచేయి చూపించిన తెలంగాణ సర్కార్..

